మరోసారి 50వేలకు పైగా కొత్త కేసులు

ఇటీవల దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు అనిపించింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలకి దిగువగా నమోదయ్యాయ్. అయితే తాజాగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50,357 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,62,081కి చేరింది.

మరోవైపు నిన్న ఒక్క రోజే 577 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,25,562గా ఉంది. తాజాగా 53,920 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 78,19,887 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5,16,632 క్రియాశీల కేసులున్నాయి. కేవలం 6.11 శాతం మాత్రమే క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 92.41 శాతం మంది డిశ్ఛార్జి అయినట్లు కేంద్రం వెల్లడించింది.