చిక్కుల్లో ఎమ్మెల్యే రసమయి

ప్రజా ప్రతినిధి అన్నప్పుడు ఎంతో బాధ్యతగా వహించాలి. ఎదుటివారు రెచ్చగొడుతున్న ఓపికగా సమాధానం చెప్పాలి. బాధతగా వ్యవహరించాలి. కానీ తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాత్రం ఓ నెటిజన్ కి ఫోన్ చేసి.. చాలా నీచంగా మాట్లాడారు. నీ అంతు చూస్తా అంటూ వార్నింగ్  ఇచ్చారు. ఇప్పుడీ ఈ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఓ వ్యక్తం తన నియోజకవర్గంలోని సమస్యలని ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే అలా చేయడం ఎమ్మెల్యేకు నచ్చలేదు. స్వయంగా ఆ వ్యక్తికి ఫోన్ చేసిన రసమయి… వార్నింగ్ ఇచ్చాడు. ఆ నెటిజన్ ఎదురుదాడికి దిగి.. మీరు ఎమ్మెల్యే పదవికి పనికిరారు. మీకు అర్హత లేదు. ఇదేనా ఓ సామాన్యుడితో మాట్లాడటం అని నిలదీశారు. దీంతో నీ అంతు చూస్తానని ఎమ్మెల్యే ఫోన్ పెట్టేశారు.