తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయ్. తాజాగా కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 857 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,51,183కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,381కి చేరింది. తాజాగా 1,504 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,30,568కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 16,449 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.