ఢిల్లీ ఫైనల్’కు, హైదరాబాద్ ఇంటికి !

అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయిర్‌-2లో హైదరాబాద్‌ను 17 పరుగుల తేడాతో ఢిల్లీ చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఫైనల్ కి చేరడం ఇదే తొలిసారి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (78; 50 బంతుల్లో, 6×4, 2×6) అర్ధశతకంతో అదరగొట్టాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. విలియమ్సన్‌ (67; 45 బంతుల్లో, 5×4, 4×6), అబ్దుల్ సమద్‌ (33; 16 బంతుల్లో, 2×4, 2×6) పోరాడారు. ఆ జట్టును రబాడ (4/29), స్టాయినిస్ (3/26) ఘోరంగా దెబ్బతీశారు. ముంబయి×దిల్లీ జట్ల మధ్య మంగళవారం లీగ్‌ ఫైనల్ జరగనుంది.