‘మహా సముద్రం’ థీమ్ పోస్టర్

‘ఆర్ఎక్స్100’తో ప్రతిభ గల దర్శకుడు అనిపించుకున్నాడు అజయ్ భూపతి. ఆయన చేస్తున్న రెండో సినిమా ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ కథానాయకులు. ఏకే ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి పండగ కానుకగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను విడుదల చేశారు.

థీమ్ పోస్టర్ క్రియేటివ్ గా ఉంది. ‘యుద్ధం’ అనే అర్ధం వచ్చేలా పోస్టర్ డిజైన్ చేశారు. దీనికి ‘అపరిమితమైన ప్రేమ’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.