మీడియాపై రాష్ట్రపతి ప్రశంసలు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మీడియాపై ప్రశంసలు కురిపించారు. సోమవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఆయన లేఖ ద్వారా ప్రశంసించారు.

“ప్రింట్‌ మాధ్యమం, పీటీఐ మీడియా స్వేచ్ఛకు రక్షణ కవచం లాంటివి. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా నవంబర్‌ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొవిడ్‌-19 ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మీడియా చురుగ్గా పనిచేసింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర చాలా ముఖ్యం” అన్నారు.