టాలీవుడ్ ఆఫ్ ది రికార్డు : ఈ నిర్మాతలే థియేటర్స్ తెరవకుండా అడ్డుపడుతున్నారట 

ఇప్పటికే థియేటర్స్ తెరవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ ప్రభుత్వం థియేటర్స్ ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా థియేటర్స్ ఓపెనింగ్ కి ఓకే చెప్పేసింది. అయితే టాలీవుడ్ లో థియేటర్లు ఓపెన్ కాకుండా బడా నిర్మాతలు అడ్డుపడుతున్నారని సమాచారమ్.

థియేటర్స్ ఓపెన్ కాకుండా సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, యువి వంశీ లాంటా వాళ్లు అడ్డం పడుతున్నారని, కేవలం ఆసియన్ సునీల్ మాత్రమే థియేటర్లు ఓపెన్ చేయాలని కోరుతున్నారని చెప్పుకొంటున్నారు.  గిల్డ్ అని పెట్టారు కానీ గిల్డ్ పెద్దలకే థియేటర్లు ఓపెన్ చేయడం ఇష్టం లేదని నిర్మాతలు చెబుతున్నారు. మరోవైపు ఈ బడా నిర్మాతలు ఎలాగైనా కరెంటు బిల్లుల రద్దు సంపాదించాలని చూస్తున్నారని తెలుస్తోంది.