ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన.. ఆ ముగ్గురు !

తెలంగాణ శాసనమండలికి గవర్నర్‌ కోటాలో నూతనంగా ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా వీరు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు.

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల కోసం కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపించాయ్. అయితే సీఎం కేసీర్ గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్  పేర్లని ఖరారు చేశారు.