క్రిష్ వ్యవహారం.. పవన్ కి నచ్చలేదట !

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ‘వీరూపాక్ష’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో వుంది. లాక్ డౌన్ వ‌ల్ల‌.. షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్ లో క్రిష్ మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించేశాడు. వైష్ణవ్ తేజ్-రకుల్ జంటగా నటిస్తున్నారు. ‘కొండ‌పొలెం’ న‌వ‌ల ఆధారంగా తెరకెక్కుతోంది.

పవ‌న్ అనుమ‌తి తీసుకునే క్రిష్ వైష్ణ‌వ్ తేజ్ సినిమా మొద‌లెట్టాడు. త‌న మేన‌ల్లుడి సినిమా కావ‌డం, పైగా షూటింగు గ్యాప్ రావ‌డంతో ప‌వ‌న్ కాద‌న‌లేక‌పోయాడు. వాస్తవానికి క్రిష్ కొత్త సినిమా మొదలెట్టాల్సి ఉండేది కాదు. ఈ గ్యాప్ లో స్క్రిప్టుపై మ‌రింత శ్ర‌ద్ధ చూపించాలి. స‌న్నివేశాలు మ‌రింత బాగా రావ‌డానికి క‌స‌ర‌త్తులు చేయాలి. కానీ `విరూపాక్ష‌` వ‌దిలేసి, మ‌రో సినిమా ప‌నిలో ప‌డిపోవ‌డం ప‌వ‌న్ కి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్య కాలంలో ఏ ద‌ర్శ‌కుడూ ఇలా ఓ సినిమా వ‌దిలేసి, మ‌రో సినిమాని మొద‌లెట్ట‌లేదు.