ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలుగు రాష్ట్రం ఏపీలో ప్రతిరోజూ 10వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదవుతూ వచ్చాయ్. కొన్నాళ్లుగా కరోనా కేసుల సంఖ్య ఏపీలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయ్. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,160 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,61,092కి చేరాయి.

నిన్న 7గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,927కి చేరాయి. ప్రస్తుతం ఏపీలో 14,770 యాక్టివ్‌ కేసులు ఉండగా..  8,39,395 మంది రికవరీ అయ్యారు.