తారక్ కోసం రస్మిక ?  కైరా ??

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. వచ్చే యేడాది మార్చి లో ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. ఈ సినిమా హీరోయిన్ ఎవరు ? అన్న దాని మీద బోలెడు గ్యాసిప్ వస్తున్నాయి. మరోసారి పూజా హెగ్డే ని కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే మళ్లీ పూజానే తీసుకుంటే.. పోస్టర్ మీద టైటిల్ మార్చినట్లు వుంటుంది తప్ప కొత్త సినిమాలా అనిపించదుగా అనే జోక్స్ కూడా వినిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో తారక్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. ఆయన మనసులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు స్టార్ హీరోలే. ప్రస్తుతం ఫుల్లు బిజీగా ఉన్న ముద్దుగుమ్మలు. వీరిలో ఒకరు కైరా అద్వానీ కాగా.. రెండో బ్యూటీ రష్మిక మందన. వీరిలో ఒకరిని తారక్ సినిమా కోసం తీసుకోవాలనే ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారమ్.