రేపే బీజేపీలోకి విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయింది. రేపు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అనంతరం ఢిల్లీలో పలువురు పార్టీ, కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక రాములమ్మ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

విజయశాంతి బీజేపీ ద్వారానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000లో బీజేపీలో చేరారు. అనంతరం తెరాసలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెరాస‌ నుంచి 2009లో మెదక్‌ ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకి ముందు విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆమెకు ఆ పార్టీలో తగినంత ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తిలో ఉంది. ఇలాంటి సమయంలో భాజాపా నేతలు ఆమెని కలిసి పార్టీలోకి ఆహ్వానించడం.. దానికి ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయ్.