తెలంగాణలో 565 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 565 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,883కి చేరింది.

నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,462కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 925 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,60,155కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.