పవన్ పర్యటనలో ప్రమాదం.. ముగ్గురుకి తీవ్ర గాయాలు !

నివర్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. కంకిపాడు, పామర్రు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పవన్ పరిశీలించారు. అధైర్య పడొద్దని రైతులకు ధైర్యం చెప్పారు. రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానన్నారు. కంకిపాడు మీదుగా ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్నారు. అంనతరం గుంటూరు జిల్లా వెళ్లనున్నారు.

పవన్ పర్యటనలో ప్రమాదం జరిగింది. ఉయ్యూరు సమీపంలో పవన్‌ కల్యాణ్‌ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్‌లు ఢీకొని ప్రమాదం జరిగింది. ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పవన్ స్పందించాల్సి ఉంది.