ప్రత్యేక హోదా కోసం.. పవన్ ఆమరణ నిరాహార దీక్ష ?!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకోబుతున్నాడా ? ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించి పెట్టనున్నాడా ? ఈ క్రమంలోనే ఆయన ఆఖరుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా రెడీ అవుతున్నాడా ?? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొద్దికాలం నుంచే పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇందులో తొలి అడుగుగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలోనూ తొలి రాజకీయ పర్యటనని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంశాన్ని సీరియస్’గా తీసుకొన్నట్టు కనబడుతోంది. ఇందుకోసం ‘జేఏసీ’ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణతో సమావేశమై జేఏసీ ఏర్పాటుపై సమాలోచనలు చేశారు.

‘జేఏసీ’ ఏర్పాటు పూర్తయిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని ఏపీ ప్రత్యేక హోదా కోసం పవన్ పోరాటం చేయనున్నాడట. ‘జేఏసీ’ తరుపున చేయనున్న పోరాటం ఫలితం ఇవ్వకపోతే.. అప్పుడు పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనకాడబోడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇంతలోతుగా ఆలోచించిన తర్వాతే పవన్ ఏపీ ప్రత్యేక హోదా అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన గెలుపుని ఎవరు అడ్డుకోలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.