టాలీవుడ్’లో విషాదం.. గుండెపోటుతో హీరో మృతి !

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పటి టాలీవుడ్ హీరో యాదా కృష్ణ(61) గుండెపోటుతో కన్నుమూశారు. యాదా కృష్ణ 20కి పైగా తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు. ‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ వంటి సినిమాల్లో ఆయన నటించారు. 2010లో వచ్చిన ‘సంక్రాంతి అల్లుడు’ ఆయనకు చివరి సినిమా.

వీవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి సునాక్షీ, రోషిని, ఏవీఎస్‌, జీవా, కొండ వలస కీలక పాత్రల్లో నటించారు. నటనతో పాటు ఆయన పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. యాదా కృష్ణ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.