స్టార్ హీరోలందరికీ.. ఆ ‘పూజ’ కావాలట !

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే పూజ.. కావాలంటున్నారు. ఇప్పుడా పూజకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ‘ముకుందా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయయ్యింది పూజా హెగ్డే. ‘డీజే’ సినిమాతో తన డిమాండ్ ఏంటో నిరూపించుకొంది. వరుస పెట్టి స్టార్ హీరోలు పూజా హెగ్డే ని బుక్ చేసుకొంటున్నారు.

ఇప్పటికే వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా కోసం హీరోయిన్’గా పూజా హెగ్డేని ఖరారు చేశారు. ఇదీగాక, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం పూజా హెగ్డేని ఎంపిక చేశారు. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పూజా మాయలో పడిపోయాడు.

‘సాహో’ సినిమా తర్వాత రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథ చిత్రంలో నటించబోతున్నాడు ప్రభాస్. ఈ సిమాని ప్రభాస్ పెద నాన్న కృష్ణం రాజు నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం చిత్రబృందం పూజా హెగ్డేని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన టాలీవుడ్ స్టార్స్ అంతా ఒకే పూజ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనబడుతోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే బెల్లకొండ శ్రీనివాస్ ‘సాక్షి’ సినిమాలో నటిస్తోంది. ఇదీగాక, సుకుమార్ – రామ్ చరణ్ ల ‘రంగస్థలం 1985’లో ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ సాంగ్ కోసం పూజ ఏకంగా రూ. 50లక్షలు తీసుకొన్నట్టు సమాచారమ్. మొత్తానికి.. టాలీవుడ్ లో పూజా హెగ్డే జోరు చూపిస్తోంది. ఈ జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.