జైట్లీతో సుజనాకు గొడవ.. !

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి సుజనాచౌదరిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజ్యసభ లాబీలో జరిగిన ఈ గొడవతో జైట్లీ తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారమ్. విభజన హామీలు, బడ్జెట్ లో ఏపీకి అన్యాయం అంశాలపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న సుజనా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం మధ్య తీవ్రంగా నలిగిపోతున్నారు.

ఈ క్రమంలోనే గురువారం రాజ్యసభ లాబీల్లో జైట్లీ టీడీపీ ఎంపీలని ఉద్దేశించి రెండుసార్లు ప్రకటన చేసినా ఎందుకు సంతృప్తి చెందలేదని ప్రశ్నించారు. దీనిపై కాస్త ఘూటుగా సమాధనమిచ్చారు సుజనా. డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరు అంటూ వాదనకు దిగారు. పార్టీలు ఉంటాయి, పోతాయి.. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు. ఊహించని సమాధానంతో జైట్లీ కాస్త నిరాశకు గురైనట్టు తెలిసింది.