టీవీ నటుడు ఆత్మహత్య

కరోనా విజృంభణతో సామాన్యుడితో పాటు సెలబ్రెటీల జీవితాలు తలకిందులయ్యారు. పలువురు సినీ, టీవీ నటీనటులు కరోనా కాలంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ హిందీ టీవీ సీరియల్స్‌కు రైటర్‌గా పనిచేసే రైటర్‌ అభిషేక్‌ మక్వానా ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు.

తాను ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైటర్‌ సూసైడ్‌ లెటర్‌ లో రాశారు. కనీస అవసరాల కోసం తీసుకున్న అప్పులను తాను చెల్లించలేకపోతున్నానంటూ.. లేఖలో అభిషేక్‌ మక్వానా తెలిపారు. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.