వైసీపీలోకి జనసేన ఎమ్మెల్యే కొడుకు

వైసీపీ వారసుల పార్టీగా మారింది. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరే నేతలు వారసులతో కలిసి చేరుతున్నారు. తండ్రి-కొడుకులు ఒకేసారి వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో వారసులని నిలబెట్టే పార్టీగా వైసీపీ ముద్రపడిపోయింది. ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొడుకు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

ఇక వైసీపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక.. మొదటి నుంచి వైసీపీ డప్పుకొడుతున్న సంగతి తెలిసిందే. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాపాకని పట్టించుకోవడం లేదు. పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో.. రాపాక దర్జాగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు.