‘IIT కృష్ణమూర్తి’ ట్రైలర్ టాక్

కొత్త దర్శకుడు శ్రీవర్ధన్ దర్శకత్వంలో పృథ్వీ దండమూడి – మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ”IIT కృష్ణమూర్తి”. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రమిది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిసెంబర్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఐఐటీ బాంబేలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న కృష్ణమూర్తి కనిపించకుండా పోయిన తన బాబాయిని వెతికే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. తన బాబాయ్ డెత్ మిస్టరీని ఛేదించే క్రమంలో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది ఇందులో చూపించారు. ట్రైలర్ లో నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ ఆకట్టుకున్నాయ్. సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ ని కట్ చేశారు.