బండి సంజయ్’కు ఢిల్లీ పిలుపు

తెలంగాణ భాజాపా బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది తెరాసకు తొలి షాక్ ఇచ్చింది. నెల తిరక్కుండా గ్రేటర్ ఎన్నికల రూపంలో తెరాసకు రెండో షాక్ ఇచ్చింది. ఇది మాములు షాక్ కాదు.. దిమ్మ తిరిగే షాక్. గ్రేటర్ లో భాజాపా అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 48స్థానాల్లో గెలుపొందింది.

ఈ విజయంపై భాజాపా అధిష్టానం ఆనందంలో ఉంది. తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ ని ఢిల్లీకి ఆహ్వానించింది. బండి సంజయ్ తన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీలను సంజయ్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం నుంచి బండికి అభినందనలు దక్కనున్నాయ్. అదే సమయంలో నెక్ట్స్ టార్గెట్ ని ఫిక్స్ చేసి పంపనున్నారని తెలుస్తోంది.