విషాదం : కరోనాతో నటి కన్నుమూత

మహమ్మారి కరోనాకు మరో సెలబ్రిటీ బలయ్యారు. బాలీవుడ్ నటి దివ్య భట్నగర్ కరోనా కారణంగా కన్నుమూశారు. నవంబర్ లో ఆమె కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమెకు వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మరోవైపు దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 32,981 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,109 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,573కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,39,901 మంది కోలుకున్నారు. 3,96,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.