క్లీన్‌స్వీప్ తప్పించుకున్న ఆసీస్ ! 


టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది.  మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా అయిదు వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్‌వెల్‌ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) అర్ధశతకాలతో రాణించారు.

అనంతరం బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (85; 60 బంతుల్లో, 4×4, 3×6) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. స్వెప్సన్‌ (3/23) టీమిండియాను ఘోరంగా దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేలవంగా ఫీల్డింగ్‌ చేసింది. సులువైన క్యాచ్‌లు జారవిడిచింది.