నేరేడ్ మెట్ లో టీఆర్ఎస్ గెలుపు

నేరేడ్ మెట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించిన అధికారులు ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కన పెట్టారు అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు మిగితా 544 ఓట్లను ఈరోజు లెక్కించారు.

ఇందులో తెరాస అభ్యర్థికే ఆధిక్యత వచ్చింది. దీంతో నేరెడ్ మెట్ డివిజన్ లో తెరాస విజయం సాధించినట్టయింది. అయితే ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ఆరోపించారు.