హాట్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్

బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టేశారు. ఇందులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి ‘సలార్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. తాజాగా ఈ సినిమా కోసం హీరోయిన్ కూడా ఫిక్సయిందని తెలుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసినట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

ఇక సలార్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ సినిమాలు చేయాల్సి ఉంది ప్రభాస్. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఒక్కో సినిమా బడ్జెట్ రూ.1000కోట్లకు పైగానే అని చెబుతున్నారు. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయితే.. ప్రభాస్ రేంజ్ మరింతగా పెరగనుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్ కు చెందినవి కావడం విశేషం.