పోలవరంలో అనుష్క పూజలు.. పెళ్లి కోసమేనా ?

స్వీటీ అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లారు. అక్కడ మహా నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి కోసమే స్వీటీ పూజలు చేశారని చెప్పుకొంటున్నారు. గతంలోనూ స్వీటీ ఇలానే పలు దేవాలయాల్లో పూజలు చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సారి ఆమె పూజలు చేసినట్టు కొన్ని ఫోటోలు కూడా బయటికొచ్చాయ్.

వాస్తవానికి బాహుబలి తర్వాత స్వీటీ పెళ్లికి రెడీ అయింది. కానీ సరైనోడు దొరకడం లేదు. స్వీటీ ఫ్యామిలీ పెళ్లి కొడుకు కోసం వెతుకులాట కొనసాగుతోంసి. అనుష్క కూడా పర్సనల్ గా కుర్రాళ్లపై ఫోకస్ పెట్టింది. కానీ ఏదీ ఫైనల్ అవ్వడం లేదు. తెరపై ప్రభాస్-అనుష్క సరిజోడు. వీరిద్దరు నిజజీవితంలోనూ కలిసి ఉండాలని.. పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఆశపడ్డారు. కానీ మేం మంచి స్నేహితులం మాత్రమేనని ప్రభాస్-స్వీటి స్టేట్ మెంట్లు ఇచ్చేశారు.

ఇక టాలీవుడ్ లో ఓ నిర్మాతతో అనుష్క పెళ్లి జరగనుంది. అతడికి ఇప్పటికే పెళ్లయింది. స్వీటీని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం గతంలో జరిగింది. కానీ ఇందులో నిజం లేదని స్వీటీ కాబోయే వాడికోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉంది. ఇక బాహుబలి తర్వాత స్వీటీ నటించిన భాగమతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అనుష్క నిశ్శబద్ధం ఓటీటీలో రిలీజై పర్వాలేదనిపించింది.