‘సర్కారు వారి పాట’ కథలో మార్పులు

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇప్పుడీ ఈ సినిమా కథలో కీలకమైన మార్పులు చేశారని సమాచారమ్. ‘స‌ర్కారు వారి పాట‌` క‌థ‌ మ‌హేష్ కి తొలిసారి వినిపించేట‌ప్పుడు ఇదో రివైంజ్ స్టోరీ. త‌న త‌ల్లిని మోసం చేసిన ఓ వైట్ కాల‌ర్ నేర‌స్థుడ్ని ప‌ట్టుకోవ‌డానికి క‌థానాయ‌కుడు చేసే ప్ర‌య‌త్నం. ఇది మ‌హేష్‌కి కూడా న‌చ్చింది.

అయితే.. లాక్ డౌన్ స‌మ‌యంలో, క‌థ‌ని, స్క్రిప్టుని పునః ప‌రిశీలించుకున్న దర్శకుడు కొన్ని కీలక మార్పులు చేశారట. రివైంజ్ డ్రామా రొటీన్ ఫార్ములా అనిపించి.. దాన్ని కాస్త మార్చిన‌ట్టు తెలుస్తోంది. త‌ల్లి పాత్ర‌ని పూర్తిగా తొలగించిన‌ట్టు టాక్‌. స‌ర‌దాగా మొద‌లైన హీరో ప్ర‌యాణం.. ఓచోట‌ సీరియ‌స్ మ‌లుపు తీసుకోవ‌డం, అక్క‌డి నుంచి వైట్ కాల‌ర్ నేర‌స్థుల్నిప‌ట్టుకోవాల‌న్న ల‌క్ష్యం ఏర్ప‌డ‌డం జ‌రుగుతాయ‌ని, దానికి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ని మార్చాడ‌ని స‌మాచారం. మార్పులు చేసిన కథకు కూడా మహేష్ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించనున్నారు.