భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన షెడ్యూల్ ఖరారు

భారత్‌లో ఇంగ్లాండ్‌ జట్టు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2021, ఫిబ్రవరి 1న మొదలయ్యే ఈ పర్యటన మార్చి 28న ముగుస్తుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మొత్తం 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేల్లో తలపడతాయి. ఒక టెస్టు గులాబి బంతితో డే/నైట్‌లో జరగనుంది.

తొలి రెండు టెస్టులకు చెన్నై, తర్వాతి రెండు టెస్టులకు మోతెరా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఐదు టీ20లకూ మోతెరానే వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్‌ మొత్తం పుణెలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5-9 వరకు తొలి, 13-17 వరకు రెండు, 24-28 వరకు మూడు, మార్చి 4-8 వరకు నాలుగో టెస్టు ఉంటాయి. మార్చి 12, 14, 16, 18, 20న టీ20లు జరుగుతాయి. 23, 26, 28న వన్డేలు ఉంటాయి.