గుడ్ న్యూస్ : ఫిట్‌నెస్ టెస్ట్’లో రోహిత్ పాస్

టీమిండియాకు గుడ్ న్యూస్. ఫెట్నెస్ టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ పాసయ్యాడు. దీంతో రోహిత్ ఆస్ట్రేలియా పయనం కానున్నాడు. టెస్ట్ సిరీస్ ఆడనున్నారు. మొదటి టెస్ట్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవుతు తీసుకోనున్న సంగతి తెలిసిందే. జనవరిలో కోహ్లీ భార్య అనుష్క బిడ్డకు జన్మనివ్వనుంది.

ఈ నేపథ్యంలో కోహ్లీ సెలవుల మీద వెళ్లనున్నారు. ఆయన స్థానంలో రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలని నిర్వహించనున్నారు. అయితే రోహిత్ మొదటి రెండు టెస్టులకి అందుబాటులో ఉండకపోవచ్చు. కరోనా నిబంధనలే ఇందుకు కారణం. మూడో టెస్టు నుంచి రోహిత్ అందుబాటులో ఉంటారు. సిడ్నీలో జనవరి 7న మొదలయ్యే మూడో టెస్ట్ నుంచి రోహిత్ అందుబాటులో ఉంటాడు.