మాజీ సీఎం తమ్ముడి వాహనంపై వైసీపీ నేతల దాడి

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడి కొడుకు, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. మదనపల్లి సమీపంలోని అంగళ్లు గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి కిషోర్ వెళ్తుండగా వైసీపీ నేతలు అడ్డగించి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

టీడీపీ నేతల రెండు వాహనాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఈ దాడి వెనక కారణలేంటీ ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ దాడి గురించి తెలిసిన వెంటనే తెదేపా యువనేత నారా లోకేష్ కిషోర్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ దాడి ఘటనని తెదేపా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.