ఏపీలో 506 కొత్త కేసులు

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గతంలో ప్రతిరోజూ 10వేలకుపైగా నమోదై కొత్త కేసులు.. ఇటీవల వందల్లో మాత్రమే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 506 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,75,531కి చేరింది.

నిన్న కరోనా బారినపడి  ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి 7,057 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 613 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,63,508కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,966 యాక్టివ్‌ కేసులున్నాయి.