భారత్-సౌతాఫ్రికా.. ఒకే రోజు రెండు టీ20 మ్యాచ్’లు

అవును మీరు విన్నది నిజమే. ఈరోజు భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈరోజే కోహ్లీ సేనతో పాటు, మిథాలీ సేన (భారత మహిళా జట్టు) దక్షిణాఫ్రికా జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, భారత్ మహిళల టి20 సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో టి20 నేడు జరగనుంది. ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టి20లలో భారత మహిళలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు.

చివరి టి20లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత మహిళలు పట్టుదలతో ఉన్నారు. అలాగే చివరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని దక్షిణాఫ్రికా మహిళలు భావిస్తున్నారు. చివరి టి20లో భారత్ విజయం సాధించి సిరీస్ దక్కించుకుంటే ఒకే పర్యటనలో రెండు సిరీస్ లు సాధించిన తొలి మహిళా క్రికెట్ జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది.

మరోవైపు, కేప్‌టౌన్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఆడే చివరి మ్యాచ్ ఇదే. మూడు టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ సునాయాసంగా గెలిచింది. రెండో టి20లో దక్షిణాఫిక్రా విజయం సాధించింది. దీంతో.. కేప్ టౌన్ లో జరిగే చివరి మూడో టి20లో భారత్ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. మరో వైపు దక్షిణాఫ్రికా కూడా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తున్నది. మొత్తానికి క్రికెట్ ప్రేమికులకు ఒకే రోజు రెండో ట్వీ20 మ్యాచ్ లు చూసే అదృష్టం దక్కిందని చెప్పవచ్చు.