తొలి టెస్టు : 50 ఓవర్లు 100 పరుగులు, 3 వికెట్లు

అడిలైడ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. 50 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ (34), రెహానె (0) ఉన్నారు. 49 ఓవర్లో పుజారా loyn బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా డక్కౌట్ కాగా, ఆపై మయాంక్ అగర్వాల్ దాదాపు గంటన్నర పాటు క్రీజులో ఉండి, 40 బంతులను ఎదుర్కొని 17 పరుగులు చేసి కుమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కోహ్లీ, పూజారా ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే సరిగ్గా జట్టు స్కోరు 100 పరుగుల వద్ద పుజారా అవుటయ్యాడు.