మహేష్ ఫోటోలని జూమ్ చేసి చూస్తా

సాయి పల్లవి అందం, అభినయంకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆమె మాత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫిదా అయింది. మహేష్ బాబు ఫోటోలని జూన్ ఇన్ చేసి మరీ చూస్తా. ఆయన చాలా అందంగా ఉంటారని ఇటీవల ఓ ఇంటర్వ్యూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. మహెష్ గురించి ఫిదా బ్యూటీ ఇంకేం చెప్పిందంటే ?

“మహేష్ చాలా అందంగా కనిపిస్తారు. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా ఉండదు. ఒక వ్యక్తి ఇంత పరిపూర్ణంగా కనిపించడం అసాధ్యమని ఆయన ఫొటోలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. ఆయన చర్మం మెరుస్తుంటుంది. ఆయన ఫొటోలను అప్పుడప్పుడు జూమ్ చేసి చూస్తుంటాను. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా కనిపించదు” అని సాయిపల్లవి తెలిపింది.

ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్యకి జంటగా ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఫిదా తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇందులో సాయి పల్లవి ఆంధ్రా అమ్మాయిగా, చైతూ తెలంగాణ పోరడుగా కనిపిస్తారని సమాచారమ్.