‘మేజర్’ ఫస్ట్ లుక్ చూశారా ?

అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అడవి శేష్ పుట్టినరోజు  సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ని మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

అడవి శేష్ కెరీర్ లోనే ఉత్తమ పెర్ఫార్మెన్స్‌లలో ఒకటిగా `మేజర్` నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.’గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.