ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన నటి

ప్రియుడు రాజ్‌ సింగ్‌ అరోడాకు నటి పూజాగౌర్‌ బ్రేకప్ చెప్పేసిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై పూజాగౌర్ స్పందించారు.

“2020.. ఈ ఏడాదిలో ఎన్నో మార్పులు జరిగాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని చెడువి. రాజ్‌తో నాకున్న రిలేషన్‌ గురించి గతకొన్నిరోజులుగా ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేనూ-రాజ్‌ విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. మా జీవితాలకనుగుణంగా మేమిద్దరం విడిపోయినప్పటికీ మా మధ్య ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవం.. జీవితాంతం ఉంటాయి. అలాగే నేను ఎప్పటికీ ఆయన విషయంలో సంతోషంగానే ఉంటాను. ఇకపై మేమిద్దరం మంచి స్నేహితులం. అది ఎప్పటికీ మారదు. ఈ విషయాన్నే మీ అందరికీ చెప్పాలనుకున్నాను” అని పూజాగౌర్‌ తెలిపారు.