హిరణ్య కశ్యప కోసం త్రివిక్రమ్ మాటలు.. నిజమా ?

మాటల రచయిత నుంచి దర్శకుడిగా ప్రమోట్ అయ్యారు త్రివిక్రమ్. తీన్ మార్ కు మాటలు అందించారు. అయ్యప్పన్ కోషియన్ రీమేక్ కు అందిస్తున్నారు. వకీల్ సాబ్ కు కూడా అందించాల్సి వుంది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. లేటెస్ట్ గా అల్లు అరవింద్ నిర్మించే రామాయణం సినిమాకు మాటలు అందిస్తున్నారు.

అయితే 2020 మార్చిలో ఓ సంఘటన జరిగిందని ఆలస్యంగా తెలిసింది. దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ తాను నిర్మించబోయే హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఎస్ లేదా నో రెండూ త్రివిక్రమ్ చెప్పలేదు. చూద్దాం అన్నట్లుగా బదులిచ్చి వదిలేసారని తెలుస్తోంది. రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో హిరణ్య కశ్యప తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు.