రకుల్’కు కరోనా పాజిటివ్

స్టార్ హీరోయిన్ రకుల్ ‌ప్రీత్‌సింగ్‌ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆమె చెప్పింది. త్వరలోనే కోలుకొని సినిమా షూటింగ్‌లలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేసింది. ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రకుల్ కోరింది. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రాములో పోస్ట్ పెట్టింది.

ఇటీవల రకుల్ కి బాలీవుడ్ లోనూ ఆఫర్లు పెరుగుతున్నాయ్. అయినా.. టాలీవుడ్ పై మళ్లీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఆమె చేతిలో మరో తెలుగు సినిమా కూడా ఉంది. ఇక రకుల్ చేతిలో మూడు హింది, రెండు తమిళ సినిమాలున్నాయి. ఇక ఇటీవల బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ పేరు మారుమ్రోగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె ఎన్సీబీ విచారణకి కూడా హాజరయ్యారు.