మారుతి-రవితేజ సినిమా క్యాన్సిల్

హిట్టు కొట్టిన దర్శకుడు ఖాళీగా ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ‘గీత గోవిందం’తో హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్ దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నాడు. ఫైనల్ గా మహేష్ తో సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రతిరోజూపండగే సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు మారుతి.. ఇంకా కొత్త సినిమాని మొదలెట్టలేదు. రామ్ కి ఓ క‌థ చెప్పాడు. అదెందుకో ప‌ట్టాలెక్క‌లేదు.

ఆ తరు‌వాత ర‌వితేజ‌తో ఫిక్స‌య్యాడు. యూవీ క్రియేష‌న్స్ ఈ సినిమా తీయాలి. అన్ని ప‌నులూ అయిపోయాయి. కానీ.. ఇప్పుడీ ప్రాజెక్టు డైలామాలో ప‌డింది. ర‌వితేజ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోబోతున్న‌ట్టు టాక్‌. క‌థ న‌చ్చినా, పారితోషికం విష‌యంలో తేడాలొచ్చాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి గానూ ర‌వితేజ 12 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. యూవీ వాళ్లు 9 ఇస్తామన్నారంట. అందుకు ర‌వితేజ ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. ఇదే కథతో గోపీచంద్ హీరోగా సినిమా చేసేందుకు మారుతి ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారమ్.