గుడ్ న్యూస్ : రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడింది

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో శుక్రవారం జూబ్లీహిల్స్‌ అపోలో  అపోలో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా రజనీ ఆరోగ్యంపై అపోలో హాస్పటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీ ఆరోగ్యం నిన్నటికంటే మరింత మెరుగుపడిందని తెలిపారు. ఇవాళ మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రానికి పరీక్షల నివేదికలు వస్తాయని చెప్పారు. రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించినట్లు వెల్లడించారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

గత పది రోజులుగా రజనీకాంత్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న అన్నాత్తే షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి శివ దర్శకుడు. అయితే. ఈ సినిమా బృందంలోని పలువురికి కరోనా పాజిటివ్ గా తేలడంతో.. షూటింగ్ ని క్యాన్సిల్ చేశారు. రజనీకి కరోనా టెస్ట్ చేయగా.. నెగటివ్ వచ్చింది. అయితే, బ్లెడ్ ప్రెజర్ సమస్యతో రజనీ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన  కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.