తెరాస నేతలకి పదవులు ఇప్పిస్తున్న బీజేపీ 

మీరు చదివింది నిజమే. తెరాస నేతలకి బీజేపీ పదవులు ఇప్పిస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో తెరాసదే హవా. అయితే ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క అంటూ బీజేపీ దూసుకొచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అప్రమత్తం అవుతున్నారు. పార్టీలోని సెకండ్ క్యాడర్ బీజేపీ వైపు చూడకుండా.. వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదీగాక సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్య ఇవ్వడం లేదనే అపవాదు ఉంది.

ఇప్పుడు దానిని తుడిపేసుకొనేందుకు మహిళా కమిషన్ ఏర్పాటు చేసి.. కమిషన్ కి అధ్యక్షురాలిగా సునితా లక్ష్మారెడ్డిని నియమించారు. ఇక ముందు కూడా తెరాసలో మహిళలకు మరింత ప్రాధాన్యత లభించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి.. భాజాపా కారణంగా తెరాసలో నేతలకి పదవులు దక్కనున్నాయ్. ఆ పార్టీలోని మహిళా నేతలకి పదవులు దక్కుతున్నాయ్. ప్రత్యర్థివర్గం గట్టిగా ఉంటే.. అధికార పక్షంలోని నేతలకి కూడా లాభమే మరీ.. !