తెలంగాణలో డేంజర్ బెల్స్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు !

తెలంగాణలో కరోనా తిరిగి విజృంబిస్తోంది. గత నాలుగురోజులుగా తెలంగాణ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో  కొత్తగా 415 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,86,354కి చేరింది.

నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,541కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 316 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,78,839కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,974 ఉండగా వీరిలో 3,823 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో మొత్తం 20 మందికి కొత్తరకం కరోనా సోకగా.. వీరిలో తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.