రంగుల పండక్కి ‘రంగ్ దే’ !

నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్టోంది. రిలీజ్ కి రెడీగా ఉన్న రంగ్ డే సంక్రాంతి కానుకగా రాబోతుందనే ప్రచారం జరిగింది. అయితే సంక్రాంతి రేసులో ‘వకీల్ సాబ్’ ఉన్నాడు. దీంతో అభిమాన హీరో పవన్ కల్యాణ్ తో పోటీపడటం ఇష్టంలేని నితిన్ తన సినిమా రంగ్ దే రిలీజ్ ని వాయిదా వేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడీ.. ఈ వార్తలు నిజమే అని తెలుస్తోంది.

రంగ్ దే సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వేసవి సెలవులతో పాటు హోళీ సెలవులు కలిసి వస్తాయని ఆ డేటుని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇక గత యేడాది ‘భీష్మ’ సినిమాతో హిట్ కొట్టాడు నితిన్. ఈ యేడాది మాత్రం నితిన్ నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రంగ్ దే పాటు చెక్ కూడా ఈ యేడాదిలోనే రిలీజ్ కానుంది.