కరోనా.. కోటి మంది కోలుకున్నారు !

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. రోజూవారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగుతున్నాయ్. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు కోటికి చేరుకుంది. ఇప్పటి వరకు 99.97లక్షల మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 18,088 కరోనా కేసులు నమోదయ్యాయ్. దాంతో ఇప్పటి వరకు దేశంలో 1,03,74,932 మంది కరోనా బారిన పడ్డారు.  ప్రస్తుతం దేశంలో 2,27,546 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 2.19 శాతంగా ఉంది. అలాగే నిన్న ఒక్కరోజే 21,314 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రివకరీల సంఖ్య 99.97లక్షలుగా ఉంది. ఆ రేటు 96.36శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 264 మరణాలు సంభవించాయి. దాంతో మృతుల సంఖ్య 1.5లక్షల మార్కును దాటేసింది.