రేవంత్ రెడ్డిని మోసం చేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ తనని మోసం చేశాడని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్లని పంచారు.  పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కొత్తపేటలో ఓ వాటర్ ట్యాంకు ప్రారంభించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. అయితేప్రారంభోత్సవంపై తప్పుడు సమాచారం ఇచ్చారట. ప్రకటించిన సమయం కంటే ముందే వాటర్ ట్యాంకు ప్రారంభించి వెళ్లిపోయారంటూ కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభోత్సవం కాగా.. కేటీఆర్ ముందే ప్రారంభించి వెళ్లిపోయారు.

ఇందుకు నిరసగా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, ముషీరాబాద్ లోనూ కేటీఆర్ కు నిరసన సెగ తలిగిలింది. ముషీరాబాద్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రోటోకాల్ మరిచారంటూ బీజేపీ నేతలు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినదించారు. మొత్తానికి.. గ్రేటర్ మంత్రికి గ్రేటర్ లోనే ఒకేరోజు రెండు నిరసనలు ఎదురుకావడం గమనార్హం.