‘క్రాక్’ రిలీజ్.. సమస్యలు తొలగిపోయాయ్ !   

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం ‘క్రాక్’. ఠాగూర్ మధు నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈరోజే (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత సినిమా విషయంలో నిర్మాత బాకీ పడిన పంచాయతీ ముందు పడటంతో… క్రాక్ బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అయ్యారు. ఉదయం 11గంటల షో పడుతుందన్నారు. కానీ అదీ జరగలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా సినిమా రిలీజ్ పై దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ కు సమస్యలన్నీ తొలగిపోయాయ్. ఫస్ట్ షో నుంచి సినిమా థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. సినిమాని చూసి ఎంజాయ్ చేయండని ట్విట్ చేశారు. కానీ ఎందుకు ఆలస్యం అయింది అనే దానిపై మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు.

మరోవైపు సినిమా రిలీజ్ వాయిదా పడిన.. సినిమాపై పాజిటివ్ టాక్ మొదలైంది. పలు వెబ్ సైట్స్ ట్విట్టర్ రివ్యూ ఇచ్చేశాయి. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ భారీ రేటింగ్స్ కూడా ఇచ్చారు. మరీ.. ఎగ్జిట్ టాక్ టాక్ ఎగ్జాట్ టాక్ అవుతుందేమో చూడాలి. అదే నిజమైతే.. క్రాక్ సూపర్ హిట్ అయినట్టే. రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్టే.