TSలో 301 కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 301 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,309కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,568కి చేరింది.

నిన్న కరోనాబారి నుంచి నిన్న 293 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,84,217కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,524 ఉండగా వీరిలో 2,459 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా వాక్సీన్ రేపు హైదరాబాద్ కు చేరనుంది. ఈ నెల 16 నుంచి వాక్సిన్ పంపిణీ చేపట్టనున్నారు.