యువతకు (పొలిటికల్) ఆహ్వానం

జాతీయ యువ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబ రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకిలించాల్సిన అవసరం ఎంతేనా ఉందన్నారు.

“ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువైన కుటుంబ రాజకీయాల వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి వారికి దేశమే ప్రథమ ప్రాధాన్యం కాదు, కేవలం వారి కుటుంబాలను రక్షించుకోవాడానికే ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఈ వ్యాధి కూడా ఒకటి.. వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది” అన్నారు.