నమ్రత పోస్ట్.. నిర్మాత నొచ్చుకున్నారు !

ఒక్కడు – మహేష్ బాబుని స్టార్ ని చేసిన చిత్రం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్-భూమిక జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఎమ్.ఎస్ రాజు నిర్మించారు. శుక్రవారంతో ఒక్కడు 18 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

“మహేష్‌ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్‌ హిట్‌. మళ్లీ మళ్లీ చూడలనించే సినిమా ‘ఒక్కడు’. నాకు ఆల్‌టైమ్‌ ఫేవరెట్” అంటూ.. ఈ పోస్టు లో.. చిత్రయూనిట్‌ సభ్యులైన మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను నమ్రత ప్రస్తావించింది. అయితే వీరిలో నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజును మాత్రం మర్చిపోయింది. దీనిపై రాజు నొచ్చుకున్నారు. మహేష్ కు ట్యాగ్ చేస్తూ ఎమ్. ఎస్ రాజు ట్విట్ చేశారు.

“పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్‌ మూవీ అయినందుకు. గుడ్‌లక్” అంటూ ట్వీట్‌ చేసి మహేష్‌ను ట్యాగ్‌ చేశారు. మరీ.. ఎమ్. ఎస్ రాజు ట్విట్ పై మహేష్ స్పందిస్తారేమో చూడాలి.